పొద్దుతిరుగుడు సాగు విధానం ( Sunflower Cultivation in Telugu )

ప్రస్తుత కాలంలో పొద్దుతిరుగుడు నునే వినియోగం ఎక్కువ అయ్యి మద్దతు పెరగడం వల్ల వీటి సాగు చెయ్యడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు.

నేల తయారి

పొద్దు తిరుగుడు పంట అన్ని కాలాలకు అనువైన పంట కావున నేల సిద్ధం చేసుకునే విధానంలో చాల వెత్యాసాలు ఉంటున్నాయి. కరిఫ్ సీజన్ లో వేస్తున్నపుడు. నేలని 2-3 సార్లు దున్నుకుని ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్ని వేసవిలో దుక్కిని ఎండబెట్టుకోవాలి. 

కరిఫ్ లో వరి పంట తరువాత రబీ పంటగా పొలం మడులలో నీటితో తడిపి విత్తనాలను నాటడం జరుగుతుంది.

డ్రిప్ పద్దతిలో ముందుగా నేలను సమతరంగా చేసుకొని డ్రిప్ పైపుకి రెండు వైపులా విత్తనాలను నటుకోవడం మరో పద్దతిగా చెప్పుకోవచ్చు. 

విత్తుకునే విధానం

ఒక్క ఎకరానికి 2 నుండి 2.5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తనశుద్ది చేసుకోవడానికి కిలో విత్తనానికి 5 మీ.లీ. ఇమిడాక్లోప్రిడ్ FS లేదా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల తైరాన్ని కలుపుకొను విత్తుకోవడం వల్ల నేల నుండి వచ్చే తెగుళ్లను మరియు విత్తనాన్ని నాశనం చేసే కీటకాలను చాలావరకు నివారించవచ్చు. విత్తనాల మధ్య దూరం సాలుల మధ్య దూరం 60 సెంటిమీటర్లు (2 అడుగులు), మొక్కల మధ్య దూరం 30 సెంటిమీటర్లు (1 అడుగు) దూరాలు ఉండేలా చూసుకోవాలి. 

గింజ నాణ్యత కోసం తీసుకోవలసిన జాగ్రతలు

  • పరాగసంపర్కం జరగడానికి తేనేటిగాలు ఎంతగానో సహకరిస్తాయి కావున పుష్పించే సమయంలో హానికరమైన రసాయన పురుగు మందులను పిచికారి చెయ్యకూడదు. 
  • ఉదయం 7 – 10 గంటల సమయాల్లో సున్నితమైన మెత్తని వస్త్రంతో పువ్వు మీద రుద్దాలి. వారం రోజులకి ఒక్కసారి చెయ్యడం వల్ల ఫలదీకరణం సక్రమంగా జరిగి గింజ నాణ్యత పెరుగుతుంది. 

పక్షుల బెడద

  • పోద్దితిరుగు పంటలో తెగుళ్ల కంటే పక్షుల వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. 
  • పొద్దు తిరుగుడు పువ్వు మీద పచ్చి కోడి గుడ్ల నీలాన్ని రెండు (2) లీటర్ల నీటికి ఒక్క గుడ్డు చొప్పున కలుపుకొని వారం రోజులకు ఒక్కసారి పిచికారి చేసుకోవాలి.
  • మెరుపు తీగెలు పంట చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి.
  • పంటను రైతులు ఒక్కే వద్ద ఎక్కువ విస్తీర్ణంలో పంటను వెయ్యాలి.
  • ఉదయం మరియు సాయత్రం సమయాల్లో శబ్దాలు చెయ్యాలి.

నీటి యాజమాన్యం

విత్తనం వేసేముందు భూమిలో తేమ ఉండేలా చూసుకోవాలి. కరిఫ్ లో వేస్తె నీటి పారుకం అంతగా ఉండక పోవచ్చు కానీ రబీ మరియు వేసవి పంటగా వేసినప్పుడు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. 7-10 రోజులకు ఒక్కసారి నీటి తడులను అందించాలి. పుష్పించే దశ నుండి గింజ బలపడేవరకు నేలలో తేమ తగ్గకుండా నీటిని పారించాలి. 

కలుపు నివారణ

విత్తనం వేసిన 2 రోజులలోపు పెండిమిదలిన్ 5 మీ.లీ ఒక్క లీటర్ నీటిలో కలుపుకొని వ్యతిరేఖ దిశలో పిచికారి చేసుకోవాలి. విత్తనం మొలకెత్తిన తరువాత గుంటుక నాగలి లేదా కలుపు నాగలితో దున్నుకోవాలి. మొక్కల మధ్య మిగిలిన కలుపు మొక్కలను సంప్రదాయ పద్దతి మనుషుల సాయంతో కలుపు మొక్కలను తొలగించాలి. మొగ్గ తొడిగే వరకు కలుపు లేకుండా వెంటవెంటనే తొలగించాలి.

పోషకాలను అందించు విధానం

ప్రతి పంట సమృద్ది ఎదుగుదలలో సరైన సమయానికి పోషక ఎరువులను అందించడం చాలా ముఖ్యం. నత్రజనిలో 25 శాతం పోటాష్ ని కలుపుకొని పంట 30 రోజుల లోపు ఉన్నప్పుడు మళ్ళి మొగ్గ తొడిగే సమయాల్లో వెయ్యాలి. 

తెగుళ్ల నివారణ

నెక్రోసిస్

ఈ వైరస్ మొగ్గ దశలో మొక్కకు ఆశిస్తుంది. నెక్రోసిస్ వైరస్ వచ్చిన మొక్క ఎదుగుదల ఆగిపోయ్యి మొక్క క్షినించడం జరుగుతుంది.

నివారణ చర్యలు

ఒక్క ఎకరానికి స్పైనోశాడ్ 60 మీ.లీ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *